బీటెక్ మేనేజ్ మెంట్ కోటా సీట్ల అడ్మిషన్ గడువు ఆగస్టు 25 వరకు పెంపు

బీటెక్ మేనేజ్ మెంట్ కోటా సీట్ల అడ్మిషన్ గడువు ఆగస్టు 25 వరకు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్  కాలేజీల్లో బీటెక్, బీఈ ఫస్టియర్  మేనేజ్ మెంట్ కోటా(బీ కేటగిరీ) అడ్మిషన్ల గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు టీజీసీహెచ్​ఈ సెక్రటరీ శ్రీరామ్  వెంకటేశ్  శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నెల 18 వరకు అడ్మిషన్లకు గడువు ఉండగా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అడ్మిషన్  గడువు పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, బీ కేటగిరీ కింద అడ్మిట్  అయిన స్టూడెంట్ల లిస్టులను ఈ నెల 30లోగా కౌన్సిల్​కు సబ్మిట్  చేయాలని ఆదేశించారు.